ఖైనీ, గుట్కా, పాన్, పాన్మసాలా మన దేశంలో అతిపెద్ద సమస్య, వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. అంటూ థియేటర్లలో వచ్చే యాడ్ చూస్తూ ఆమె రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని నవ్వుతుంటారు. అందులో విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకోరు. దేశవ్యాప్తంగా ఎంతగా ప్రచారాలు చేసినా గుట్కా వాడకం పెరుగుతూనే ఉంది. అలా మంచిగా చెప్తే వినడు అనుకుందేమో ఓ వధువు.. పెళ్లి పీటలపైనే కాబోయే భర్త చెంప చెళ్లుమనిపించింది.
అసలు విషయం ఏంటంటే పెళ్లి తంతు జరుగుతోంది. వధువు, వరుడు పెళ్లి పీటలపై కూర్చుని ఉన్నారు. పండితుడు మంత్రాలు చదువుతున్నాడు. వరుడు పెళ్లి పీటలపై గుట్కా నములుతున్నాడని వధువు గ్రహించింది. అతనికి అడ్డుచెప్పండంటూ పూజారికి రెండు తగిలించింది. తర్వాత వరుడు నోట్లో గుట్కా ఊసే వరుకు ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. వెంటనే పెళ్లికొడుకు లేచి గుట్కా ఊసి కూర్చున్నాక శాంతించింది. మొదట ఈ ఘటన చూసి బంధువులందరూ షాక్ అయ్యారు. అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. వధువు మంచిగా బుద్ధి చెప్పిందిలే అని ప్రశంసించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియకపోయినా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.