ఇతడి పేరు మహమ్మద్ రబ్బాని. బంధువుల పెళ్లి ఉండడంతో ఆ వేడుకకు హాజరయ్యాడు. ఇక వరుడి పాదాలకు పసుపు రాస్తూ గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
ఈ మధ్యకాలంలో గుండెపోటు సమస్యతో చాలా మంది చనిపోతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తూ జనాలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే తాజాగా పెళ్లి వేడుకలో పాల్గొన్న ఓ వ్యక్తి పసుపు రాస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అతడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయ్యాయి.
హైదరాబాద్ పాతబస్తిలోని కాలాపత్తార్ లో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇతడు తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ వేడుకుల్లో బంధువులంతా హాజరై ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఈ క్రమంలోనే మహమ్మద్ రబ్బాని వరుడి పాదాలకు పసుపు రాస్తూ క్షణాల్లోనే కుప్పకూలాడు. వెంటనే గమనించిన బంధువులు మహమ్మద్ రబ్బాని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు.
ఈ వార్తతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహమ్మద్ రబ్బాని వరుడి పాదాలకు పసుపు రాస్తూ కుప్పకూలిన దృశ్యాలను బంధువులు ఫొన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ భయందోళనలకు గురవుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.