నేటి ఈ ఆధునిక యుగంలో ఏది జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. పైగా అవి క్షణాల్లో వైరల్ గా కూడా మారుతున్నాయి. అయితే ఈ రోజుల్లో నమ్మక ద్రోహం చేసే మనుషుల కంటే జంతువులే నమ్మకంగా, విశ్వాసంగా ఉంటున్నాయి. దీనికి సాక్ష్యంగా మనం ఎన్నో వీడియోల్లో చూసి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకనే కదా మీ ప్రశ్న? విషయం ఏంటంటే? ఈ రోజుల్లో వాహనదారులు రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా ప్రయాణిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.
కానీ ఓ ఆవు మాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనదారులు.. సిగ్గు పడండి అంటూ మెసెజ్ ఇస్తుంది. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో రోడ్డుపై కార్లు ప్రయాణిస్తూ ఉన్నాయి. అటు నుంచి వచ్చిన ఓ ఆవు జిబ్రా క్రాసింగ్ వద్దకు అక్కడే ఆగి వేచి చూసింది. ఆవు యజమాని వచ్చేంత వరకూ అక్కడే ఉంటూ అతను రాగానే అతని జిబ్రా క్రాసింగ్ పై ఆవు నడుచుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియను చూసిన కొందరు నెటిజన్స్.. ఈ ఆవును చూసైనా ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.