telangana news : ప్రేమకు.. ఆకర్షణకు మధ్య ఆడ,మగ జీవితాలు నలిగిపోతున్నాయి. ప్రేమలో ఇద్దరి మధ్యా ఆకర్షణ ఉండటం మామూలే.. పెళ్లి తర్వాత ఆ ఆకర్షణ ఇద్దరి మధ్యా విడదీయరాని బంధంగా మారితే పర్లేదు.. కానీ అలా జరగకుండా పెళ్లి తర్వాత ఆకర్షణ తగ్గిపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలిసి వస్తుంది. అక్రమ సంబంధాలు, విడాకులు.. ఆడకు మగపై ఇష్టం లేకపోవటం.. మగకు ఆడంటే ఇష్టం లేకపోవటం.. ఇలా ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలలు కూడా కాపురం చేయకుండానే భార్యను ఇష్టం లేదు పోమ్మంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బట్టు తండా 2కు చెందిన బాదావత్ అనిల్ కుమార్, చౌటపల్లి శివారు లచ్చ తండాకు చెందిన స్రవంతి ప్రేమించుకున్నారు. గత జనవరి నెలలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. భార్యతో సరిగ్గా నెలా 15 రోజులు కాపురం చేసిన అనిల్ కుమార్ కొత్త పాట పాడుతున్నాడు. స్రవంతి అంటే ఇష్టం లేదని అంటున్నాడు. దీంతో ఆమె భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తనకు భర్త కావాలంటూ, న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భార్యతో చనువుగా యువకుడు.. అతడి అడ్డు తొలిగిస్తేనే మంచిదని..
పెళ్లై 20 రోజులు.. మరిదిని ప్రేమించింది.. అందరూ షాక్ అయ్యేలా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.