నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఎండీ వీసీ సజ్జనార్ విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే.. సంక్రాంతి పండుగ, మేడారం జాతర, మహిళల దినోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనలను ప్రకటించిన సజ్జనార్ ఉగాది సందర్భంగా మరో మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ అంటే తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్య పండుగ. ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ రోజున.. పుణ్య క్షేత్రాలను సందర్శించడం, స్నేహితులను, బంధువులను కలుసుకునేందుకు వెళ్తుంటారు. అలాంటి వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఉగాది ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 2న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజనులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కేవలం ఏప్రిల్ రెండో తేదీ ఉగాది పండుగ రోజు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు) కండక్టరుకు చూపించి ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. టీఎస్ఆర్టీసీ ప్రకటించిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
On the occasion of #Ugadi #TSRTC Offers Free Ride to Senior Citizens above 65 years only on 2nd April 2022 in all types of #TSRTCBusServices @TSRTCHQ @ntdailyonline @TV9Telugu @Eenadu_Newspapr @sakshinews @way2_news @TelanganaToday @IndiaToday @bbcnewstelugu @baraju_SuperHit pic.twitter.com/v5fUK4uOyL
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 31, 2022
ఇది కూడా చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 59 కే రోజంతా ప్రయాణం