కరోనా విజృంభన తర్వాత.. మనదేశంలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు.. వైద్య రంగానికి పెద్ద పీట వేయడం ప్రారంభించాయి. బడ్జెట్లో వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. భారీ కేటాయింపులు చేస్తున్నాయి. అంతేకక వైద్య రంగంలో కనీస మౌలిక సౌకర్యాల కల్పన దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా.. వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ.. ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించామని.. త్వరలోనే ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని.. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గతంలో తెలిపారు. అలానే మారుమూల ప్రాంతాల్లోనూ ఆసుపత్రులు నిర్మించి పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకోస్తామని వెల్లడించారు.
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం అరుదైన రికార్డు నెలకొల్పే దిశగా.. అడుగులు వేస్తోంది. దేశంలోనే ఎత్తైన ఆస్పత్రి నిర్మాణం చేపట్టనుంది. హైదరాబాద్ కొత్తపేటలోని పండ్ల మార్కెట్ స్థలంలో టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పేరుతో ఎత్తైన ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఇక ఈ ఆసుపత్రి దేశంలోనే ఎత్తయిన ప్రభుత్వ ఆసుపత్రిగా నిలవనుంది. సుమారు 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిని 123 మీటర్ల ఎత్తు, 27 అంతస్తుల్లో నిర్మించినున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆస్పత్రి నమూనా భవనానికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరలుతోంది.
ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే.. ఇది.. దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎత్తైన హస్పిటల్గా రికార్డు సృష్టించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆస్పత్రి నిర్మాణానికి రూ.668 కోట్ల వ్యయం అవుతున్నట్లు తెలిసింది. ఇక ఈ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన టెండర్ని ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మాణ దక్కించుకుంది. ఇక ఇప్పటికే టిమ్స్ పేరుతో ఎల్బీనగర్తో పాటు అల్వాల్, సనత్నగర్లలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రులను నిర్మిస్తోంది. ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకల సామర్థ్యంతో.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా ప్రభుత్వం వీటిని నిర్మించనుంది. ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.