గత కొన్ని రోజులుగా తెలంగాణ లో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో తనదైన దూకుడు పెంచారు. ఇటీవల పార్లమెంట్ లో మోదీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళన చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కేసులు కూడా పెట్టారు. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటంతో వెళ్లి ఆయన పిండాలను మూసి నదిలో కలిపి వారి నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు పెంపుడు కుక్క, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
ఇది చదవండి: కరోనాతో చనిపోయిన అమ్మకి గుడి కట్టి పూజిస్తున్న కొడుకు!
ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ… ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేదలకు సేవా కార్యక్రమాలు చేయమని, భావితరాలకు భరోసానిచ్చే మొక్కలు నాటే కార్యక్రమాలకు పిలుపునిస్తే మా అధినేతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి మేం పిండ ప్రధానం చేశామన్నారు. మీ పార్టీ అధ్యక్షుడి పుట్టికనే ప్రశ్నించిన బీజేపీని ఎదురించిన గొప్ప మనస్సు తమ నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అలాంటి కేసీఆర్ కి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.