దసరా పండగా నేపథ్యంలో భారతదేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ గా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నిజమైంది. హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. చారిత్రక నగరమైన భాగ్యనగరంలో విధ్వసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాడులకు ప్రణాళిక రచించిన ముగ్గర్ని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులో ఒకరైన జాహెద్ ను ప్రశ్నించగా అనేక విషయాలు వెల్లడైయ్యాయి. ఆరు ప్రాంతాల్లో బాబులు పేలుడులకు జాహెద్ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు.
భాగ్యనగరానికి పెను ముప్పు తప్పింది. దసర పండుగ వేళ కల్లోలం సృష్టించాలన్న టెర్రరిస్టులు ప్లాన్ను భగ్నం చేశారు పోలీసులు. ఉగ్రకుట్ర గురించి తెలిసి హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడికి పథకం వేసిన ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిని అబ్దుల్ జాహెద్, అబ్ధుల్ సమీ, మాజ్ హాసన్ గా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన అబ్దుల్ జాహెద్ కు ఐఎస్ఐ, లష్కరే తొయిబాలతో లింక్ లు ఉన్నాయి. జాహెద్ గ్యాంగ్ నుంచి నాలుగు గ్రానేడ్లు, దాదాపు రూ.5.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జాహెద్ చరిత్ర చూస్తే హైదరాబాద్ తో సహా దేశ వ్యాప్తంగా ఉగ్రదాడుల్లో నిందితుడు. 2005లో బేగంపేటలో టాస్క్ఫోర్స్ ఆఫీసుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రమేయం ఉందని పోలీసులు గతంలో ఓ సారి అరెస్టు చేశారు. 2002లో దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం దగ్గర దాడుల్లో జాహెద్ గ్యాంగ్ పాత్ర ఉంది.
హైదరాబాద్లో పేలుళ్లతో అలజడి సృష్టించాలనేది వీరి ముగ్గురి ప్లాన్. ఆ ఏర్పాట్లలో ఉండగానే పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ పేలుళ్ల కోసం పాకిస్తాన్ నుంచి నిధులు అందినట్లు పక్కా సమాచారాన్ని పోలీసులు సేకరించారు. పాక్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్లతో దాడులకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. పాకిస్థాన్ నేపాల్ మీదుగా జాహెద్ కి హ్యాండ్ గ్రెనేడ్లు చేరినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో హ్యాండ్ గ్రెనేడ్ల టెస్ట్ కి పథకం రచించినట్లు గుర్తించారు. ఇప్పటికే ఆరు ప్రాంతాల్లో జాహెద్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఐదు రోజుల కిందట తొమ్మిది మందితో సమావేశమై పేలుళ్ల కోసం వ్యూహరచన చేశారని తెలిసింది.