హైదరాబాద్ లోని అమ్నీషియా పబ్ లో ఓ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి సూరజ్, హాదీ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన బాలిక(17) గత నెల 28న జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లోని అమ్నీషియా పబ్లో జరిగిన మైనర్ పార్టీకి వెళ్లింది. కొద్దిసేపు ఉండి పబ్ నుంచి బయటకు వచ్చింది. ఇంటికి వెళ్లిన బాలిక మెడపై గాట్లు ఉండడం గమనించిన తండ్రి ఆరా తీశాడు. దీంతో తనతో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించారని తండ్రికి తెలిపింది. దీంతో జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు.
ఈక్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్ పబ్లో ఉన్నాడు. బాలిక పబ్ నుంచి బయటకు రాగానే ఆ యువకులు ఆమెను బెంజ్ కారులో బలవంతగా ఎక్కించుకున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బాలికతో కారులో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేకలు పెట్టేందుకు యత్నించగా సూరజ్, హాదీలతో పాటు మరో యువకుడు బెంజ్ కారును అక్కడే ఉంచి ఇన్నోవా కారులో బాలికను బలవంతంగా కూర్చొబెట్టుకుని పబ్ వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్లారు.
ఇదీ చదవండి: ఈ కారులో 30 రూపాయలతో 300 కిలోమీటర్లు! తెలుగు కుర్రొడి ఘనత..
తనపై నలుగురు గ్యాంగ్ రేప్ చేసినట్లు బాలిక పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఓ ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడే వదిలేసిన బెంజ్ కారును తీసుకువచ్చి పోలీసు సీజ్ చేశారు. మరోపక్క నిందితుల్లోనూ ముగ్గురు మైనర్లుగా తెలుస్తోంది. అయితే ఈ గ్యాంగ్ రేప్ సమయంలో ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కొడుకు ఉన్నారా లేదా అనే విషయంపై విచారణ చేస్తున్నట్లు పోలీసు తెలిపారు. అదుపులో ఉన్న ఇద్దరు యువకులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.