ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో తరచూ ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ఓ మహిళ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకంది. మూసాపేట్ మెట్రో స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో మూసాపేట్ మెట్రో స్టేషన్ లో రైలు వస్తుండగా ఒక్కసారిగా పట్టాలపైకి దూకి.. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హై సెక్యూరిటితో పాటు, టికెట్ ఉంటేనే మెట్రో స్టేషన్ లోకి అనుమతి ఉంటుంది. అలాంటిది ఈ వ్యక్తి ఎలాంటి టికెట్ లేకుండానే స్టేషన్ లోపలికి ప్రవేశించాడు. అలానే ఫ్లాట్ ఫామ్-2 మీదకు వెళ్లి ఎదురుగా రైలు వస్తున్న సమయంలో ఒక్కసారిగా పట్టాలపై దూకాడు.
ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు అబులెన్స్ సిబ్బంది తెలిపారు. అతడు స్థానిక వ్యక్తి అయి ఉంటాడని అక్కడి సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాపు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్టేషన్ లోని సీసీ పుటేజ్ లో నమోదు అయ్యింది. మూసాపేట్ స్టేషన్ లో ఇటీవలే మరియమ్మ అనే మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. మరి.. ఇలా మెట్రో స్టేషన్ లో ఆత్మహత్య ఘటనలు జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.