దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువైంది. ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నట్టే చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వివిధ రాష్ట్రాల్లో పంజా విసురుతుంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
భవిష్యత్తులో మరో 10 కొత్త కరోనా వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోకపోవడమే ఒమిక్రాన్ వ్యాప్తికి కారణం అన్నారు. ఒమిక్రాన్ను కరోనా నుంచి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి : దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్!
ప్రపంచంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వల్ల ఒక్క మరణమే సంభవించిందన్నారు. తెలంగాణలో కరోనా మూడో దశ విజృంభణ ఎదురైతే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇక లాక్డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు. తెలంగాణలో 97 శాతం మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 100 శాతం మంది తొలి డోసు తీసుకున్నారని వెల్లడించారు.