ఈ ఏడాది భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ సామూహిక జాతీయ గీతాలాపన జనగణమన పాడాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 11గంటల30 నిమిషాలకు ఈకార్యక్రమం ప్రారంభమవుతుంది.
జాతీయ గీతాలాపనలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ అబిడ్స్ జీపీఓ సర్కిల్లో జరగనుంది. ఈ కారణంతో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.30 దాకా నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొంటారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఆంక్షలు విధించిన రూట్ లో వెళ్లేవారు.. ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిదని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Render the National Anthem in Mass Number to demonstrate our pride in celebrating the 75th anniversary of Independence Day.
Join us for a mass recitation of the national anthem on August 16th at 11:30 a.m.#StandTogether #NationalAnthem #MassRecitation #TelanganaPolice pic.twitter.com/H0dWKVqndR
— Telangana State Police (@TelanganaCOPs) August 15, 2022