తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. 4,59,242 మంది పరీక్షలు రాయగా.. 2,24,012 మంది పాస్ అయ్యారు. ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
పరీక్షా ఫలితాలు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in ఆన్లైన్ మోడ్లో అందుబాటులో ఉంచారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు వెబ్సైట్లోకి వెళ్లి రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి. స్కోర్ కార్డులో విద్యార్థులు సాధించిన మార్కుల జాబితా ఉంటుంది. అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేస్తే సర్వర్ బిజీ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయంగా examresults.ts.nic.in వెబ్సైట్లోకి కూడా వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
టైటిల్ : స్టార్ హీరో విక్రమ్ కి కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు!