గత కొంత కాలంతా ఓ ఛానల్ ద్వారా అధికారా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన కథనాలు ప్రసారాం చేస్తూ హల్ చల్ చేస్తున్న తీన్మార్ మల్లన్న గురించి తెలిసిందే. ఇటీవల ఆయనపై పలు అభియోగాల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనను చంచల్ గూడ జైలు కి తరలించారు. కాగా, తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది.
జైలు నుంచి విడుదలయ్యాక వారానికి ఒక రోజు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించించి. ఈ బెయిల్ ఆయనకు కొన్ని షరతుల కింద మంజూరు చేసింది. ప్రజలను రెచ్చగొట్టే వీడియోలు గానీ, ప్రసంగాలు గానీ తన సొంత చానల్లో టెలికాస్ట్ చేయొద్దని కండీషన్ పెట్టింది. ఎవరినీ ఎక్కడ కూడా ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయరాదని చెప్పింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులెవరైనా బెదిరింపు కాల్స్ చేయకూడదని.. ఫిర్యాదు చేస్తే విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది.
కాగా, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారని ప్రముఖ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ మల్లన్నపై కేసు నమోదు చేయగా కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. అయితే, ప్రస్తుతం తీన్మార్ మల్లన్న హైదరాబాద్లోని చంచల్గూడలో ఉన్న విషయం తెలిసిందే. ఆ గడువు ఈ నెల 9తో ముగియడంతో మల్లన్న తరఫు లాయర్ సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. రిమాండ్ సమయంలోనే 4 రోజుల పోలీస్ కస్టడీ కూడా ముగిసిందని, బెయిల్ ఇవ్వాలని కోరగా కోర్టు మంజూరు చేసింది.