కొన్ని రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న దృశ్యం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అసెంబ్లీ సమావేశాల్లో.. వైసీపీ నేతలు.. తన భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మీడియా ముందు.. చంద్రబాబు నాయుడి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సంఘటనపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. నందమూరి కుటుంబం కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. వైసీపీ నేతలపై విరుచుకుపడింది. అయితే ఈ సంఘటనపై తెలంగాణ రాజకీయ నేతలు.. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలేవరు స్పందించలేదు. దీని గురించి ఏబీఎన్ రాధకృష్ణ టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ప్రశ్నించగా.. ఆయన ‘‘చంద్రబాబు కుటుంబం మీకు ముఖ్యం.. మాకు కాదు’’ అన్నారు. ఒపెన్ హార్ట్ విత్ ఆర్కే షో కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో తెగ వైరలవతోంది.
ఈ వారం ఒపెన్ హార్ట్ విత్ ఆర్కే సీజన్-3 కార్యక్రమానికి టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలో ఆర్కే పలు అంశాలపై తలసానికి ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలు, తెలంగాణలో సినిమా టికెట్ల అంశంతో పాటు భువనేశ్వరి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధింని ప్రోమో వీడియో తెగ వైరలవుతోంది. పూర్తి వివరాల కోసం కింద లింక్ ఒపెన్ చేయండి. తలసాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.