సాధారణంగా పోలీసులు అంటే కర్కశంగా ఉంటారు.. వారికి దూరంగా ఉండటం చాలా మేలు అని భావిస్తుంటారు. కొంత మంది పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టేందుకు కూడా భయపడుతుంటారు. కానీ.. పోలీసుల్లో కూడా మంచి మనుసు ఉన్నవాళ్లు ఉంటారని ఎన్నో సార్లు రుజువైంది. ఫుట్ పాత్ పై ఉన్న అభాగ్యులను ఆదుకోవడం.. ఎవరైనా రోడ్లపై ఆపదలో ఉంటే వారిని రక్షించడం లాంటివి చేస్తూన్నారు పోలీసులు. తాజాగా ఓ వ్యక్తి ఆపదలో ఉంటే కానిస్టేబుల్ అతనికి సీపీఆర్ చేసి రక్షించిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ బంజారాహిల్స్ లో మంగళవారం ఫుట్ పాత్ పై ఓ వ్యక్తి కరెంట్ షాక్ తగలడంతో స్పృహ కోల్పోయాడు.. దాంతో అక్కడ ఉన్న జనాలకు ఏం చేయాలో పాలుపోలేదు.. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సై రాకేశ్ రెడ్డి తన సిబ్బందితో చేరుకున్నారు. అయితే కరెంట్ షాక్ కి గురైన వ్యక్తికి శంకర్ అనే కానిస్టేబుల్ సీపీఆర్ చేయడంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి తరలించారు.
కరెంట్ షాక్ తో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శంకర్ పై డిపార్ట్ మెంట్ తరుపు నుంచే కాదు.. నెటిజన్లు కూడా గ్రేట్ జాబ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో రోడ్లపై ఊపిరి ఆడక ఇబ్బందిపడిన వారిని కొంతమంది కానిస్టేబుల్స్, హూంగార్డులు ఇలా సీపీఆర్ చేసి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లో కరెంట్ షాక్తో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తికి “సీపీఆర్” చేసి ప్రాణాలు కాపాడిన హైదరాబాద్ పోలీసులు.
Traffic constable Mr. Shankar saves the life of an electric shock victim by performing #CPR at Banjara hills #LifeSavingAct #HyderabadCityPolice pic.twitter.com/R7tyAZK62o— Hyderabad City Police (@hydcitypolice) November 22, 2022