వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఓఆర్ఆర్పై ఇక మీదట మరింత వేగంతో దూసుకెళ్లొచ్చు.
విశ్వనగరంగా డెవలప్ అవుతున్న హైదరాబాద్కు ఓ మణిహారం లాంటిదిగా ఔటర్ రింగ్ రోడ్ను చెప్పొచ్చు. సిటీలోని అన్ని ప్రధాన ప్రాంతాలను చుట్టేసేలా ఈ రింగ్ రోడ్ను అభివృద్ధి చేశారు. సుదూర ప్రాంతాలకు కూడా ఈ రోడ్ మీదుగా క్షణాల్లో చేరుకోవచ్చు. విదేశాల స్థాయిలో ఈ రోడ్ను డెవలప్ చేశారు. నగరంలోకి వచ్చేవారు, వెళ్లేవారు కూడా వారికి అందుబాటులో ఉన్న ఓఆర్ఆర్ మీదుగా తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకుంటున్నారు. ఈ ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న భూముల ధరలకు రెక్కలు రావడాన్ని కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ ఓఆర్ఆర్ వెలుపల, లోపల టౌన్ షిప్స్ వెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఓఆర్ఆర్ మీద ప్రయాణించే వాహనాలకు స్పీడ్ లిమిట్ ఉంటుందనే విషయం తెలిసిందే.
ఓఆర్ఆర్ పై వెళ్లే వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 100 కిలో మీటర్లుగా ఉండేది. దీన్ని తాజాగా పెంచారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వెహికిల్స్ స్పీడ్ లిమిట్ను పెంచుతున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. స్పీడ్ లిమిట్ను గంటకు 120 కిలోమీటర్లకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఓఆర్ఆర్పై ప్యాసింజర్ సేఫ్టీకి మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేగ పరిమితిని పెంచిన నేపథ్యంలో వాహనదారులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలని అర్వింద్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించిన తర్వాత అర్వింద్ కుమార్ ఈ ప్రకటన చేశారు.
The maximum speed limit on #ORR is increased to a maximum of 120 kms/ hour from the present maximum limit of 100 kms/ hour
In the review meeting held today, minister @KTRBRS reviewed the arrangements & has instructed @HMDA_Gov to ensure all safety protocols in place pic.twitter.com/yz5Wobsoq8
— Arvind Kumar (@arvindkumar_ias) June 27, 2023