తెలంగాణలో గత కొంత కాలంగా అధికార పక్షం.. ప్రతిపక్షాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా ఇబ్రహీం పట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై కోడి గుడ్లతో దాడి చేశారు కొంత మంది యువకులు. ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా NSUI నాయకులు ఆయన కారును అడ్డగించారు. కోడిగుడ్లతో ఆయన పై దాడి చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి సమయంలో కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టిన టీఆర్ఎస్ నాయకులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయించలేదని నినాదాలు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి సమయంలో నిన్న కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టారు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. తమ పై దాడి చేసిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని నిలదీశారు NSUI నేతలు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేపై కోడి గుడ్ల దాడి చేసినట్లు తెలిపారు. నిరసన తెలుపుతున్న NSUI నాయకులను అడ్డుకొని టీఆరెస్ నాయకులు.. చిత్తగొట్టారు. దీంతో సాగర్ హై వే పై పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.