వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఘటనలు అనేకం చూస్తుంటాం. ట్రాఫిక్ పోలీసులు కళ్ళముందు కనిపిస్తున్నా అయన ముందుకు తీసుకెళ్లి మరీ మన వాహనాన్ని పెడుతుంటాం. అందులోనూ సిగ్నల్ పడుతోందంటే.. బర్రున దూసుకెళ్లే వాహనదారులు చాల మంది ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా వాహనదారులు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానున్నారు. ఆ వివరాలు..
ఇప్పటి వరకు లైసెన్స్ లేకుంటే, ఒక బైక్పై ముగ్గురు ప్రయణించడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, కారు సీటు బెల్టు పెట్టుకోకపోవడం లాంటివి జరిగితే భారీగా జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు సిగల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే కూడా జరిమానా విధించనున్నారు. ‘రోప్’ (రిమూవల్ ఆప్ అబ్జెక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోట్మెంట్) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ ట్రైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్టుకు ఆటంకం కలిగేలా వ్యవహరిస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు. అలాగే.. పాదచారులకు ఆటంకం కలిగేలా చేస్తే రూ.600 ఫైన్ విధిస్తామని వెల్లడించారు. ఈ నిబంధనలు అక్టోబరు 3 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. వాహనదారులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతీ ఒకరి కర్తవ్యం
సమస్యలు లేకుండా సమయానికి ఇంటికి చేరాలి అంటే ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.
ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం!సురక్షితంగా ఇంటికి చేరుకుందాం.!#RoadSafety #WearHelment #SeatBelt #TelanganaPolice @HYDTP @CYBTRAFFIC @Rachakonda_tfc pic.twitter.com/hPlzIJbYvr— Telangana State Police (@TelanganaCOPs) September 28, 2022