గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాను తొలగించాలని అన్నారు. ఇదే విషయంపై ఏకంగా సీఎంకు విజ్ఞప్తి చేశారు రాజాసింగ్. పాకిస్తాన్ కోడలు సానియాను అంబాసిడర్ హాదా నుంచి తొలగించాలని తెలిపారు. ఒలంపిక్స్లో రెండు సార్లు పతకాలు అందించింది పీవీ సింధు. దీంతో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాను తప్పించి పీవీ సింధును నియమించాలని ఆయన సూచించారు. ఇప్పుడు ఇదే అంశం రాజకీయంగా తవ్ర చర్చకు దారి తీస్తోంది.
గతంలో అనేక సార్లు సానియాపై ఇలాంటి కామెంట్లు చేశారు రాజాసింగ్. తాజాగా మరోసారి మనకు పాకిస్తాన్ కోడలు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదని, వెంటనే ఆమెను తొలగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరుతున్నారు. టోక్యో ఒలంపిక్స్లో భాగంగా కాంస్య పతకం తీసుకొచ్చిన పీవీ సింధు. భారత కీర్తి పతాకాన్ని రెపరెప లాడించిన పీవీ సింధుకి ప్రసంశల వెల్లువ కొనసాగుతోంది. అయితే తాజాగా రాజాసింగ్ పీవీ సింధుని నియామించాలని సూచిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ సానియా మీర్జా పట్ల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.