బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై నిప్పులు చేరిగారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్ల కు భయపడే వ్యక్తిని కాదని ఈటల అన్నారు. గతంలో నయూం ముఠా బెదిరింపులకే భయపడలేదని, ఇప్పుడు ఈ కేసీఆర్ కు ఎలా భయపడతానని తెలిపారు. అయితే తనకు, తన కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని ఈటల అన్నారు. తప్పు చేసిన వాళ్లు దొరలెక్క ఉంటున్నారని.. ప్రజల కోసం పనిచేసే వాళ్లుకు మాత్రం శిక్షలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. శాసనసభలో బీజేపీ హక్కులను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని తెలిపారు.
ఇంకా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ..” శాసనసభలో నాకు జరిగిన అన్యాయంపై న్యాయ నిపుణులతో మాట్లాడతాను. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లకు, రాజకీయ పార్టీలకు లేఖళు రాస్తాను. ఈ ముఖ్యమంత్రి దురహంకార విధానాలను , దుర్మార్గాల్ని తెలంగాణ అంతా తిరిగి ప్రజలకు చెబుతాను. నన్ను తెలంగాణ ప్రజలను ఇంతలా ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ ను ప్రజా క్షేత్రంలో ఓడించేదాకా నిద్రపోను. స్పీకర్ ను మరమనిషి అన్నందుకే నన్ను సభ నుంచి సస్పెండ్ చేశారు. మరి…ప్రధానమంత్రిని, కేంద్రమంత్రులను అనేక రకాల తిట్లతో దూషించిన కేసీఆర్ ను ఏం చేయాలి? తెలంగాణ భాషను, సంస్కృతిని అవమానిస్తున్నది ముఖ్యమంత్రే” అని ఈటల రాజేందర్.. సీఎంకేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
ఇంకా ఈటల మాట్లాడుతూ..”స్పీకర్ మరమనిషిలా పనిచేస్తున్నారని అన్నా. నేను ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేస్తాని చెప్పినప్పుడు ఆయన అసెంబ్లీకి రాలేదు. ముగ్గురు ఎమ్మెల్యేలున్న భాజపాకు అసెంబ్లీలో గది కేటాయించాలని కోరినా.. ఇవ్వకుండా అవమానపరిచారు. అసెంబ్లీలో నన్ను సప్పెన్షన్ చేయడమే కాకుండా పోలీసులను ఇంటికి పంపించి హౌస్ అరెస్టు చేయించారు. అసెంబ్లీ చరిత్రలో ఇంత దుర్మార్గంగా ఎన్నడు జరగలేదు. నా ముఖం చూడటం ఇష్టం లేకపోతే ముఖ్యమంత్రీ సభకు రావద్దు” అంటూ ఈటల ఫైర్ అయ్యారు. మరి.. ఈటల రాజేందర్.. కేసీఆర్ పైచేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.