నేడు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులర్పించేందుకు వస్తున్న మంత్రి కేటీఆర్కి చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కారు రాంగ్ రూట్ తీసుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని బాపూఘాట్ వద్ద రాంగ్ రూట్లో వస్తున్న కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్సై అడ్డుకున్నారు. దాంతో ఒక్కసారే షాక్ తిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయానికి వస్తే.. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులర్పించేందుకు మంత్రి కేటీఆర్ వస్తున్నారు.
అదే సమయంలో హర్యానా గవర్నర్ దత్తత్రేయ మహాత్మునికి నివాళులర్పించారు.. ఆయన కారు బయటకు రావడంతో.. కేటీఆర్ కారు రాంగ్ రూట్ తీసుకుంది.. ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే మంత్రి స్థాయిలో ఉన్న కేటీఆర్ ని ఎస్సై ఆపడంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాఫిక్ ఎస్సైని పక్కకి తోసేసినట్లు సమాచారం. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.