తన పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ను సస్పెండ్ చేయాలని మంత్రి కేటీఆర్ సంబంధింత అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం అధికారులు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే..
జూలై 24 మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ గోపు గంగాధర్ సిబ్బందికి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. అనుకోని కారణాలతో సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, సిస్టమ్ మేనేజర్ మోహన్ ఆ వేడుకలకు హాజరు కాలేదు. ఆగ్రహించిన కమిషనర్.. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ ఆ ముగ్గురికి గురువారం మెమోలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వివాదం ముదరడంతో కమిషనర్ మెమోలను ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉండగా వివాదంపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు.
కమిషనర్ గంగాధర్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తి పూజకు తాను దూరమని, అలాంటి వారిని తానేప్పుడు ప్రోత్సహించనని ఆయన తెలిపారు. రాజకీయాల్లో గానీ, వ్యక్తిగతంగా గానీ ఇలాంటి కార్యక్రమాలను ప్రొత్సహించే వ్యక్తుల్లో తాను చివరిగా ఉంటానని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరి.. ఉద్యోగులకు మెమో జారీ చేసిన విషయంలో మంత్రి కేటీఆర్ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I am the last person to encourage sycophancy in politics or administration
Read about an over enthusiastic Municipal commissioner issuing a memo to subordinates for not attending my birthday celebrations!🤦♂️
Have asked @cdmatelangana to suspend the MC for his absurd behaviour
— KTR (@KTRTRS) July 29, 2022