పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. చేతిలో కాగితం పట్టుకుని రావడంతో ఫిర్యాదు చేయడానికి వచ్చారని పోలీసులు భావించారు. పీఎస్ కు వచ్చిన సదరు వ్యక్తి కూడా తన చేతిలో ఉన్న ఫిర్యాదు కాపీని అక్కడున్న పోలీసులకు ఇచ్చాడు. ఆ వృద్దుడు ఇచ్చిన ఫిర్యాదు అందుకొని షాక్ అయ్యారు పోలీసులు. సదరు వ్యక్తి మనుషులపై కాకుండా ఓ కుక్కపై చర్యలు తీసుకోవాలని.. తనను అది చిత్ర వద చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ రైతు పోలీస్ స్టేషన్ కి ఓ చిత్రమైన ఫిర్యాదుతో వెళ్లాడు. అది చూసి పోలీసులు ఖంగు తిన్నారు.. ఇంతకీ ఆ ఫిర్యాదులో ఏముందంటే.. తనను ఓ కుక్క ప్రతిరోజూ చిత్ర హింసలకు గురి చేస్తుందని.. తాను వ్యవసాయానికి వెళ్తున్న సమయంలో పగబట్టి మరీ తన వెంట పడి రెండు సార్లు తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు గూడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే మొదట పుల్యా ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు ఆశ్చర్యపోయినా.. అతడు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉందచుకొని శునకం యజమానిని స్టేషన్ కు పిలిపించి పుల్యా నాయక్ సమక్షంలో మందలించారు.
తన కుక్క వల్ల పుల్యా ఇబ్బంది పడితే ఇక నుంచి జాగ్రత్త తీసుకుంటానని.. అలాగే ఆయన హాస్పిటల్ ఖర్చులు కూడా తాను భరిస్తానని చెప్పడంతో కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చగా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.