ఇప్పటివరకు హైదరాబాద్ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చేది ఛార్మీనార్, గోల్కొండ, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్, హైదరాబాద్ బిరియాని అంతే కదా! ఇకపై ఆ జాబితాలోకి మరో మణిహారం చేరనుంది. అదేంటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు.
దక్షిణాది నగరాలలో డెస్టినేషన్ సిటీగా ఆవిర్భవిస్తోన్న హైదరాబాద్లో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఇది సందర్శకులకు అందుబాటులోకి రానుంది. చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక కేంద్రాలకు కేంద్రబిందువైన భాగ్యనగర అందాన్ని మరింత పెంచేలా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను తీర్చిదిద్దుతోంది. ఇంతకీ ఏంటా మణిహారం అంటారా..? ‘టన్నెల్ అక్వేరియం’. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్వాల్గూడలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.
రోజులు గడుస్తున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రం విశ్వఖ్యాతిని మూటగట్టుకుంటోంది. మొన్నటి యాదాద్రి మొదలు.. నిన్నటి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అన్నీ కొత్త హంగులతో రూపుదిద్దుకున్నవే. ఇక దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి గురుంచి మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు పాతది అయిపోయినా.. విదేశాలకే పరిమితమైన కేబుల్ బ్రిడ్జి సంస్కృతి హైదరాబాద్ మహా నగరంలో కొత్త అనుభూతినిచ్చిందని చెప్పాలి. ఇప్పడు కొత్తగా భూగర్భ అక్వేరియం సిద్ధమవుతోంది. దీని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
‘మంత్రి కేటీఆర్ గారూ మన హైదరాబాద్లో టన్నెల్ అక్వేరియం ఎందుకు లేదు? ఏదేని అద్భుతమైన సరస్సుల క్రింద ఇది సాధ్యం కాదా? దయచేసి తెలంగాణకు అద్భుతమైన టన్నెల్ అక్వేరియం బహుమతిగా ఇవ్వండి సార్. దయచేసి ఒక్కసారి ఆలోచించండి అంటూ ఓ నెటిజన్ మంత్రిని ప్రశ్నించాడు. అతను ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మంత్రి స్పందించారు. ‘ఎందుకు సాధ్యం కాదు. సాధ్యమవుతుంది. మన తెలంగాణలో ఇలాంటి ఇప్పుడు మనం కూడా పెడుతున్నాము.. ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో.. దేశంలోనే అతిపెద్ద అక్వేరియం, ఏవియరీని నిర్మిస్తున్నామంటూ కేటీఆర్ బదులిచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా కేటీఆర్ జతచేశారు.
We are building India’s largest Aquarium and Aviary at Kothwalguda. Work is in progress
Will have @arvindkumar_ias and @HMDA_Gov share pictures and details https://t.co/Jm1vs5EM2p
— KTR (@KTRBRS) April 17, 2023