ఈ మద్య కాలంలో ఆన్లైన్ డెలివరీ సంస్థలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇప్పటికే ఫుడ్, షాపింగ్ రంగాల్లో ఆన్లైన్ ఆర్డర్స్ పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఆన్ లైన్లో ఆర్డర్ లు పెట్టడానికే ఇష్టపడుతున్నారు. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో తమకు నచ్చిన వస్తువులు ఎంపిక చేసుకోవడం, ఇక ఒక్క క్లిక్ తో ఆ వస్తువు ఆర్డర్ చేయడం ఎక్కడికి వెళ్లకుండా హాయిగా ఇంట్లో కూర్చునే ఈ హోమ్ డెలివరీ పొందడం లాంటివి చేస్తున్నారు. ఇక కోల్ కతా మద్యం ప్రియులకు కేవలం పది నిమిషాల్లో మద్యం డోర్ డెలివరీ పొందో అవకాశం అందుబాటులోకి వచ్చింది. బూజీ అనే బ్రాండ్తో కోల్కతా నగరంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది.
ఆన్లైన్ సేవలకు ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మద్యం డెలివరీ చేసే సంస్థలు ఉన్నాయని.. కానీ పది నిమిషాల్లో చేసే సంస్థ తమదేనని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని ఈ సేవలు ప్రారంభించింది. మద్యం డెలివరీ చేసేలా బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బూజీ సంస్థ సీఈఓ వివేకానంద తెలిపారు.అయితే ఆన్లైన్ లో మద్యం ఆర్డర్ ఇచ్చేందుకు వినియోగదారులు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, సెల్ఫీ ఫొటోను అప్లోడ్ చేసి వయస్సు ధ్రువీకరించాల్సి ఉంటోందని సీఈఓ వెల్లడించారు. అంతేకాకుండా.. సగటున ఒక వినియోగదారుడికి ఎంత మద్యం విక్రయించాలనే విషయంపై బెంగాల్ సర్కారు విధించిన పరిమితులు దాటితే మద్యం ఆర్డర్ ఇవ్వలేరని స్పష్టం చేశారు సంస్థ సీఈఓ. కల్తీ మద్యం, మైనర్లకు డెలివరీ చేయకుండా నిబద్ధతతో పనిచేస్తామని ఆయన చెప్పారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.