పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఒకప్పుడు కనీసం కలలో కూడా ఊహించని వాటిని నిజం చేస్తున్నాడు. సాకేంతిక విజ్ఞానం అన్ని రంగాల్లో పెను మార్పులు తీసుకువచ్చింది. మనిషి శ్రమ, కష్టాన్ని తగ్గిస్తున్నాయి. ఇక వైద్య రంగంలో సాంకేతిక అభివృద్ధి పెను విప్లవాన్నే తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఎంతో కష్టమైన చికిత్సలను..ఇప్పుడు చాలా సులువుగా చేస్తున్నారు. అనేక వ్యాధులకు ఇప్పుడు మంచి చికిత్స లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాంకేతికత అభివృద్ధి కారణంగా మనిషికి పునర్జన్మ ప్రసాదించే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ఇందుకు బోలేడు ఉదాహరణలు. ఒకప్పుడు మన శరీరంలో ఓ అవయవం తెగిపోయింది అంటే.. ఇక అంతే సంగతులు.. జీవితాంతం అంగ వైకల్యంతో బాధపడాల్సిన పరిస్థితి. కానీ నేటి కాలంలో కాస్త చురుగ్గా వ్యవహరిస్తే.. ఆ ప్రమాదం తప్పించవచ్చు అంటున్నారు వైద్యులు. అనడమే కాక ఓ వ్యక్తికి తెగిపోయిన చేయిని తిరిగి అతికించి అద్భుతం చేశారు. ఆ వివరాలు..
వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చేలా ప్రయత్నిస్తే ప్రమాదాల్లో తెగి పడిన అవయవాలు అతికించడానికి ఆస్కారం ఉంటుందని నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. యంత్రంలో పడి తెగిపోయిన కార్మికుడి మణికట్టుని తిరిగి అతికించిన ఆసుపత్రి ఆర్థోపెడిక్ టీమ్ వైద్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన వివరాలను వివరించారు. “సంగారెడ్డి జిల్లా నందిగ్రామ్ ప్రాంతంలో ఓ పరిశ్రమలో పని చేస్తున్న హరీష్ (22) అనే కార్మికుడి చేయి యంత్రంలో పడి మణికట్టు వరకు తెగిపడింది.
ఇది కూడా చదవండి: Husband: బైక్ కే బోర్డు తగిలించుకోని తిరుగుతున్న భార్య బాధితుడు! వీడియో వైరల్..ఈ క్రమంలో మణికట్టుని ఓ ప్లాస్టిక్ కవర్లో వేసి దాన్ని ఐస్ లో పెట్టి తీసుకొచ్చారు. అనేక గంటలు శ్రమించిన వైద్యులు మణికట్టుని తిరిగి అతికించారు. కొన్ని నెలల్లో తిరిగి చేయి మామూలు స్థితికి వస్తుంది. చేతులు, వేళ్లు, కాళ్లు తెగిపడ్డప్పుడు వెంటనే అవయవాన్ని ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఐస్ పెట్టుకొని తీసుకురావాలి. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు తాగునీళ్లు ఇవ్వడం వంటి చర్యలు చేయవద్దు. ముందు అంబులెన్సు వచ్చే విధంగా చేయాలి. ఆరుగంటల వ్యవధి లోపు రోగిని అవయవాలను చేర్చితే వాటిని రక్షించడానికి అవకాశాలు ఉంటాయి” అని వివరించారు. ఈ సంఘటనపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.