బతికి ఉన్నప్పుడు ఏ భర్తయినా..భార్యను ప్రేమిస్తాడు. ఐతే..చనిపోయిన తర్వాత కొంతమంది భర్తలు మాత్రమే భార్య జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి గద్వాల్ కు చెందిన హనుమంతు(86). తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమెకి గుడి కట్టి తన ప్రేమను చాటుకున్నాడు. హనుమంతు అనే పెద్దాయన ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో తన జీవిత విశేషాలు వివరించాడు. తన భార్యకు గుడి కట్టడానికి గల కారణాలను తెలిపారు.
గద్వాల్ కు చెందిన హనుమంతు, రంగమ్మ అనే వృద్ధ దంపతులు ఉన్నారు. జీవిత చివరి దశలో ఒకరికొకరు తోడునీడగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2019లో అనారోగ్యంతో రంగమ్మ మరణించింది. తన జీవితం పంచుకున్న భార్యను మర్చిపోలేకపోయాడు. ఆమెపై ఉన్న ప్రేమకు చిహ్నంగా ఆమెకు ఆలయం కట్టించాడు. ఇది అంతా కేవలం మూడు నెలల కాలంలో పూర్తి చేశాడు ఆ పెద్దాయన. ఒక భర్త..భార్య చనిపోయిందని బాధపడకుండా విగ్రహం రూపంలోనే ఆమెను చూసుకుంటున్నాడు. తాను బతికి ఉన్నంతకాలం తన జీవితం భార్యకు అంకితం అంటున్నాడు భర్త హనుమంతు. తన వ్యవసాయ క్షేత్రంలోనే భార్య కోసం గుడి కట్టించి.. ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హనుమంతు గారి పూర్తి ఇంటర్య్వూపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలనూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.