భాగ్యనగరంలో హుస్సేన్ సాగర్ పై ఓ అద్భుత నిర్మాణం చేపట్టనున్నట్లు HMDA కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ లో పంచుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ఉండే తేలియాడే వంతెన తరహాలోనే హుస్సేన్ సాగర్ పై కూడా నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: అమ్మకానికి భర్త: ‘ఆరడుగులు ఉంటాడు- నిజాయితీ పరుడు’
ఈ ఏడాది చివర్లో నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మాస్కోలోని జర్వాడే పార్కులో నదిపై ఉన్నట్లుగానే నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఆ వంతెన నదిపైకి ‘U’ ఆకారంలో తేలుతున్నట్లు ఉంటుంది. ఆ వంతెనపై ఉంటే నదిపై తేలియాడుతున్న అనుభూతిని పొందుతారు. అచ్చు అలాగే అద్భుతంగా నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. అందులో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే.. వంతెనకు ట్రాన్సపరెంట్ గ్లాస్ ను వినియోగించారు. అంటే వంతెనపై నుంచి కింద ఉండే నది అందాలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఒకేసారి 2,400 మంది పర్యాటకులు ఈ వంతెనపై నుంచి అందాలను వీక్షించొచ్చు.
ఇప్పటికే హైదరాబాద్ మహా నగరంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మంచి పర్యాటక ప్రాంతాలు. అలాంటి ప్రదేశంలో ఇలాంటి ఇంజినీరింగ్ అద్భుత నిర్మాణం జరిగితే హుస్సేన్ సాగర్ రూపురేఖలే మారిపోతాయి. పర్యాటకంగా హైదరాబాద్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A surprise, well something similar, is on its way at the PVNR marg, jutting into the Hussain Sagar, will be up and running before the end of this year https://t.co/yoju5WOPzI pic.twitter.com/sPluPaIuqq
— Arvind Kumar (@arvindkumar_ias) January 21, 2022