కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ (డ్రస్ కోడ్) వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కర్ణాటకలోని కొన్ని జిల్లాలకే పరిమితమైన ఈ వివాదం.. చాపకింద నీరులా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. హిజాబ్ కు మద్దతుగా హైదరాబాద్ లోని ఓ కాలేజీ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరారు. హిజాబ్ వివాదంపై స్పందించారు. అయితే అందరిలా కామెంట్స్ చేయకుండా.. తన అభిప్రాయాలను కవిత రూపంలో తెలియజేశారు.
ఇది కూడా చదవండి : కర్ణాటకలో ముదురుతున్న ‘హిజాబ్’ వివాదం..
ఈ సందర్బంగా తాను స్వయంగా రాసిన కవితను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ కవితలో మహిళల వస్త్రధారణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు… హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందన్నారు. మహిళలు ఎలా ఉండాలి.. ఏం ధరించాలి.. ఏం చేయాలి.. అన్న విషయాలను వారి ఇష్టాఇష్టాలకే వదిలేయాలన్నారు. స్త్రీలు సృష్టికర్తలు అన్న కవిత.. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు.
Wearing and applying Sindoor is my conscious choice
Wearing Hijab is Muskan’s choice.Let women decide what they are comfortable in embracing and wearing.#DontTeachUs pic.twitter.com/wDuYVW6X5O— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 10, 2022
‘‘హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్..
మతమేదైనా సరే…
మనమంతా భారతీయులమే..
సిందూర్-టర్బన్-హిజాబ్-క్రాస్
ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే…
“త్రివర్ణ పతాకాన్ని” రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..
“జై హింద్” అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..
“సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ ” అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా..
“జన గణ మన” తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..
మనకు చెప్పింది ఒక్కటే..
మనం ఎవరైనా… మనమంతా భారతీయులమనే.. !!’’
అంటూ సాగిన ఈ కవిత ప్రస్తుతం తెగ వైరలవుతోంది. జాతీయవాదాన్ని చాలా చక్కగా వర్ణించారు అని ప్రశంసిస్తున్నారు నెటిజనులు.