తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల పుణ్యమా అంటూ కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల నగదుతో దళిత బంధు అనే పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకాన్ని ముందుగా హుజురాబాద్లో అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఇక ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కిపెట్టడంతో వారిని దెబ్బకొట్టేందుకు ఆ పథకాన్ని తన దత్తత గ్రామమైన వాసాలమర్రికి షిఫ్ట్ చేశారు. ఇక దళిత బంధు పథకం లాగే అన్ని రకాల కుల వృత్తులకు ఇలాంటి పథకాలను రూపోందించాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కల్లు గీత కార్మికులకు ఓ గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్రంలోని గౌడన్నలకు ద్విచక్రవాహనలు అందించనున్నామని ఆయన తెలిపారు. ఇక ఫస్ట్ ఫేజ్లో 15 వేల మంది లబ్ధిదారులకు ఉచితంగా ద్విచక్ర వాహనాలను అందజేస్తామని, దీని అమలు కోసం ఏకంగా రూ.1200 కోట్లు కేటాయించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. రాష్ట్ర మంత్రిమండలి నుంచి అనుమతి రాగానే ఈ పథకం పూర్తి స్తాయిలో అమల్లోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో గౌడన్నలు ఒక్కసారిగా ఎగిరి గంతేస్తున్నారు. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.