రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించక పోవడం. ప్రమాదాల నివారణకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తుంటారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు చెల్లించలేక వాహనదారులు సతమతమవుతుంటారు. అదే సమయంలో మరోసారి పోలీసులకు పట్టుబడితే పాత ఈ చలాన్ల లను భారంగా భావించి జరిమానాలు చెల్లించకుండా వాహనాలను అక్కడే వదిలేస్తారు వాహనదారులు. అలాంటి వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఊరట ఇవ్వనున్నారు. పెండింగ్ లో ఉన్న చలానాలు కట్టేందుకు వీలుగ వాటీలో రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.
ఇటీవల కొందరు వాహనదారులు చలాన్లు కట్టలేక రోడ్లపైనే వాహనాలు వదిలి వెళ్లిపోయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి పరిష్కారం కోసం హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాయితీ ఇవ్వడం ద్వారా జరిమానాలు చెల్లించే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ మేరకు చర్యలు ప్రారంభించారు. సంయుక్త కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. “ప్రమాదాలు నియంత్రించేందుకే జరిమానాలు విధిస్తున్నాం. మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారం మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడితే రూ.10వేల వరకూ జరిమాన, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది.
ఈ విషయం తెలిసినా మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్నారు. మొత్తం రూ.600కోట్ల వరకు చలాన పెడింగ్ లో ఉంది” అని సంయుక్త కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పెండింగ్ చలానాలు కట్టాలన్న నిబంధనలున్నా.. రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో అందరి ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో రాయితీ ఇవ్వాలని నిర్ణయించాం. రాయితీ ఎంత అన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.