ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్ రాయడానికి ఉన్న అర్హత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వాస్తవానికి ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీటు సంపాందించాలంటే ఇంటర్ లో కనీసం మార్కులు 40 రావాలి.కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అనేక నిబంధనలను సడలించారు. గత మార్చిలో కూడా ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. అనంతరం అక్టోబర్ లో పరీక్షలు నిర్వహించారు.
అందులో కేవలం 49 శాతం విద్యార్థులు పాసయ్యారు. ఇదే సమయంలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అందరిని కనీసం మార్కులతో పాస్ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం వీళ్లు ఏప్రిల్లో సెకండియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఫస్టియర్ అనుభవాలను పరిగణనలోనికి తీసుకుంటే, ఎక్కువ మంది 40 మార్కులు సాధించడం కష్టమనే అంచనాలు తెరమీదకొస్తున్నాయి. దీంతో 35 మార్కులతో ఉత్తీర్ణులైతే ఎంసెట్ ద్వారా సీటు పొందే అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. త్వరలో ఉన్నత విద్యామండలి దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించే వీలుంది. మరి.. ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.