ఏదైనా సమస్యపై సామాన్యులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా.. అధికారులు వెంటనే స్పందించరు. అదే ఎవరైనా సెలబ్రిటీలో, రాజకీయ నాయకులు ఆ సమస్య గురించి ప్రశ్నిస్తే.. తక్షణమే దాన్ని పరిష్కరించేందుకు నడుం బిగిస్తారు. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇలానే ప్రవర్తించారు. మన విశ్వనగరం హైదరాబాద్ ఎంత సుందరంగా ఉంటుందో అందరికి తెలుసు.. ముఖ్యమైన కాలనీలు, ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతాలు, హై-ఫై ఏరియాలు తప్ప మిగతా నగరమంతా చెత్త కుప్పలే దర్శనం ఇస్తాయి. ప్రతి కాలనీ మలుపు దగ్గరో.. ప్రారంభంలోనో ఇలా చెత్త కుప్పలుగా పోగు పడి ఉంటుంది. దాని గురించి జనాలు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించరు. వారి దయ.. జనాల ప్రాప్తం అన్నట్లు ఉంటుంది అధికారుల వైఖరి. తాజాగా ఈ చెత్త సమస్యపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జీహెచ్ఎంసీ అధికారులను పరుగులు పెట్టించింది అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి మన టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్స్ని అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఎప్పుడు ఇలా తన గురించి మాత్రమే పబ్లిసిటీ చేసుకోవడం కాదని.. తనకు సామాజిక బాధ్యత కూడా ఉందని నిరూపించుకుంది అనుపమ. అందులో భాగంగానే ఆమె తన సోషల్ మీడియాలో ఈరోజు చేసిన పోస్ట్ ఏకంగా జీహెచ్ఎంసీ అధికారులను ఊరుకులు పరుగులు పెట్టించింది. అసలు ఇంతకీ అనుపమ చేసిన పోస్ట్ ఏంటి.. అసలు ఏం జరిగింది.. అనే వివరాలు తెలియాలంటే.. ఇది చదవండి..
అనుపమ పరమేశ్వర్ ఈరోజు తన ట్విట్టర్ అకౌంట్లో హైదరాబాద్లోని కొన్ని ఏరియాల ఫొటోలను షేర్ చేసింది. అవేవో అందంగా ఉండే ఫొటోలు కావు. చెత్తా చెదారం నిండిపోయిన ఏరియాలకు సంబంధించినవి. ఇలా చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో.. అక్కడ సమీపంలో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి స్థానికులు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారో లేదో.. ఒకవేళ చేసినా.. వారు పట్టించుకున్నారో లేదో తెలియదు కానీ.. అనుపమ మాత్రం సదరు ఏరియాల ఫొటోలను తన ట్విట్టర్లో షేర్ చేయగానే… వెంటనే GHMC అధికారులు రియాక్ట్ అయ్యారు. అసలు ఆ ఫోటోలున్న ఏరియా వివరాలను షేర్ చేయాలంటూ వారు అనుపమను కోరారు. దీనిపై అనుపమ ఏమీ రియాక్ట్ కాలేదు. కానీ నెటిజన్స్ మాత్రం కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అనుపమ పోస్ట్ చేసిన ఫొటోల్లోనే అడ్రస్ ఉందని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే.. తెలుస్తుందని GHMC అధికారులకు తెలిపారు.
“Good” morning! pic.twitter.com/z2cHXUxE4F
— Anupama Parameswaran (@anupamahere) June 15, 2022
ఏదైతేనేం ఎట్టకేలకు GHMC అధికారులు అనుపమ పోస్ట్ చేసిన ఫొటోల్లోని ప్రదేశాలను కనిపెట్టి ఆ ఏరియాలను వెను వెంటనే క్లీన్ చేశారు. క్లీన్ అయిన తర్వాత అధికారులు ఆ ఫొటోలను తీసి అనుపమ పరమేశ్వరన్కి రీట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ అనుపమకి థాంక్స్ చెబుతున్నారు. కనీసం మీ ద్వారా అయినా ఆచెత్త సమస్య పరిష్కారం అయ్యింది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Good morning, garbage is cleared in the premises and staff is posted to keep vigil not to throw the garbage. pic.twitter.com/EXkYa27a0B
— MC Narsingi Municipality (@mcnarsingi) June 16, 2022
Tq so much madam this is my home opposite madam pic.twitter.com/Xqz03gc1Ar
— PRANAY DUDDU NSUI RJNR Constituency president (@DudduPranay) June 15, 2022