ఈ మధ్యకాలంలో గుండెపోటుతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. అయితే తాజాగా ఓ రైతు పొలంలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అతడి మృతితో భార్య, పిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
గత కొంత కాలం నుంచి గుండెపోటుతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. జిమ్ చేస్తూ, డాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ ఇలా ఎక్కడి వారు అక్కడే హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వాళ్ల వరకూ చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఓ రైతు ఏకంగా పొలంలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం. ఇక్కడే వంగాల కృష్ణ(50) అనే రైతు నివాసం ఉండేవాడు. ఇతనికి పెళ్లై పిల్లలు ఉన్నారు. ఇక ఉన్న ఊరిలో ఇతనికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులోనే రకరకాల పంటలు పండిస్తుండేవాడు. అయితే కృష్ణ ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం పొలం వద్దకి వెళ్లాడు. ఇక అటు ఇటు తిరుగుతున్న క్రమంలోనే అతడు ఒక్కసారిగా పొలంలోనే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇక వెంటనే వారు అపస్మారకస్థితిలో ఉన్న కృష్ణను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అతడు అప్పటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు. ఈ వార్త విన్న అతని భార్య, పిల్లలు గుండెలు పగిలేలా ఏడ్చారు. అయితే ఉన్నట్టుండి కృష్ణ గుండెపోటుతో మరణించడతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో పోలంలోనే కుప్పకూలిన ఈ రైతు విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.