కరోనా మహ్మమారి వలన దాదాపు రెండేళ్లు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. 2021-22 విద్యా సంవత్సరంలో ఆన్ లైన్ తరగతులతో పాటు పాఠశాలల్లో బోధించారు. కరోనా కంటే ముందు ప్రతిసారి వేసవి సెలవు అనంతరం జూన్ 12 పాఠశాలల పునఃప్రారంభమవుతాయి. ఒక వేళ ఏదైనా హాలిడే వస్తే జూన్ 13న పాఠశాలలు తెరుచుకుంటాయి. ఈసారి తెలంగాణలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం, కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన వారిలో నెలకొంది. అయితే పొడగింపు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని, యథాతథంగా స్కూల్స్ తెరుచుకుంటాయని తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది. అయితే సెలవుల పొడగింపు ఉంటాదని వస్తున్న వార్తలపై ఆదివారం మరోసారి ప్రకటన చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..” రేపటి జూన్ 13 నుంచి స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అయోమయానికి గురికావొద్దు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాము. అదే విధంగా ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది” అని ఆమె తెలిపారు. తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున పాఠశాలలకు సెలవులకు పొడగింపులు ఉండొచ్చనే కథనాలు జోరందుకున్నాయి. అయితే అలాంటిదేం.. ఉండబోదని విద్యాశాఖ ఆ వెంటనే స్పష్టత ఇచ్చేసింది.
ఇదీ చదవండి: విద్యార్థులకు ఆర్టీసీ షాక్.. భారీగా పెరిగిన బస్ పాస్ ఛార్జీలు!
కరోనా కేసుల పరిస్థితి అదుపులోనే ఉన్నందునా.. వేసవి కాలం సెలవులు పొడగించే ప్రసక్తే లేదని విద్యాశాఖ తేల్చి చెప్పింది. కరోనా జాగ్రత్తలతో పాఠశాలలు నడిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. మరి.. విద్యాశాఖ ఇచ్చిన ఈ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.