Telangana Assembly Budget Session 2022 : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ. 2,56,958.51 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రూ. 12,000 కోట్లు కేటాయించారు. సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల సాయం అందించనున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. రాష్ట్రవాప్తంగా 4 లక్షల మందికి, నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.