ప్రస్తుతం నడుస్తున్నదంతా సోషల్ మీడియా యుగం. అందుకే దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్ లతో బిజీ బిజీగా ఉంటున్నారు. అంతేకాక సోషల్ మీడియాలో సైతం చాలా మంది యాక్టీవ్ గా ఉంటున్నారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మహిళలపై, ప్రజాప్రతినిధులపై ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి హైదరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. అందుకే దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్ లతో బిజీ బిజీగా ఉంటున్నారు. అంతేకాక సోషల్ మీడియాలో సైతం చాలా మంది యాక్టీవ్ గా ఉంటున్నారు. తమ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ, వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలపై, రాజకీయ ప్రముఖలపై, ప్రజాప్రతినిధులపై ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ట్రోలర్స్, మీమర్స్ శృతిమించి ప్రవర్తిస్తున్నారు. అందుకే హైదాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు, అలానే మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే తాట తీస్తామంటున్నారు. అసభ్యకరమైన పోస్టులు చేసినా, మీమ్స్, ట్రోల్స్ చేసినా.. ఫొటో మార్ఫింగ్ చేసినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా పలు విషయాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..” ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై ట్రోల్స్ చేసిన 20 మందిపై కేసులు నమోదు చేశాము. వారి 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము” అని ఆమె తెలిపారు. అలానే మరో 30 మంది ట్రోలర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
గతకొంత కాలం నుంచి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పరిధి దాటి వ్యవహరిస్తున్నాయని స్నేహమెహ్రా తెలిపారు. ఇటీవలి కాలంలో కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లు గీత దాటి వ్యవహరిస్తున్నాయని డీసీపీ క్రైమ్ స్నేహ మెహ్రా. తెలుగురాష్ట్రాల్లోని పలు యూట్యూబ్ ఛానళ్లలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలపై అసభ్యకరమైన రీతిలో పదాలు వాడి ట్రోలింగ్ చేశారు. ఇలాంటి వాటిపై హైదరాబాద్ క్రైమ్ టీమ్ నిఘాపెట్టడమే కాకుండా ఆధారాలు సేకరించింది. అలానే ఆయా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.
ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలుకు పంపిస్తామని డీసీపీ స్నేహ మెహ్రా హెచ్చరించారు. రేటింగ్, వ్యూస్, డబ్బు కోసం అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై నిరంతంర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. వీటి కోసం తాము ప్రత్యేక వింగ్ ను ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహిళపై, ప్రజాప్రతినిధులపై అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. మరి.. ట్రోలర్స్ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.