హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. స్రీట్ నంబర్ 5లో రోడ్డు పది అడుగుల మేర గొయ్యి పడింది. అప్పుడే అటుగా ఇసుక లోడ్ తో వెళ్తున్నమినీ ట్రక్ అందులో కూరుకుపోయింది. రోడ్డు ఒక్కసారిగా ఓ వైపుకు ఒరుగుతుండటంతో వాహన దారులు, స్థానికులు ఆందోళన చెందారు. రోడ్డు మీద గొయ్యి పడి, వాహనం అందులో కూరుకుపోవడంతో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది.
కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. ఎప్పుడో చేసిన డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పైపులన్నీ ప్రధాన రహదారులపై ఉండటంతో పాటు నాలాలు తప్పు పట్టడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు. నాలా వ్యవస్థ లీకేజ్ కారణంగా రోడ్డ్లు తడిసి, కుంగిపోతున్నాయని చెబుతున్నారు. ఇటీవల భోషా మహాల్ లో ఇటీవల నాలా కుంగిపోయిన ఘటన మర్చిపోకముందే మరో ఘటన జరుగుతుండటం నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.