తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఈ ఏడాది మొదటి వారం నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. పలువురు సినీ, రాజకీయ నేతలు కరోనా భారిన పడుతున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సభ్యులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతన్నారు. ఇటీవల కరోనా బారినపడ్డ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హోంఐసోలేషన్ లో వుండి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురవడంతో అపోలో హాస్పిటల్ లో చేరారు. అపోలో వైద్యులు భట్టి విక్రమార్కకు అన్నిరకాల వైద్య పరీక్షలు జరిపారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వద్దని సూచించారు.
ఇది చదవండి : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సినీ రచయిత కన్నుమూత
ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తన అభిమానులు, మధిర నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆసుపత్రికి వెళ్లి భట్టి విక్రమార్క త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని కోరారు.