పంట పొలాల్లో విమానాలు, హెలికాఫ్టర్ లు కూలిపోయిన ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఆయా సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరిగింది. తాజాగా నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో పెద్దవూర మండలం తుంగతుర్తిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలెట్, ట్రైనీ పైలెట్ స్పాట్ లోనే చనిపోయారు. అయితే.. ఈ చాపర్ ఎక్కడ నుంచి వచ్చింది? ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది? విషయం తెలియగానే అక్కడికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారిలో కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు.కాగ.. ఈ ఘటనపై పోలీసుల విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.