రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్తున్న మూఢనమ్మాకాలను పాటించే అంశంలో అంతకంటే ఎక్కువే వెనకబడి ఉంది మన సమాజం. అక్షరాస్యత పెరుగుతున్నప్పటికి.. సమాజంలో కొన్ని మూఢనమ్మకాలను తొలగించలేక పోతున్నాం. వాటిలో ప్రధానమైంది చేతబడి, క్షుద్రపూజలు. ఇలాంటి వన్ని పిచ్చి చేష్టలు అని కొట్టి పారేసినా.. చాలా మంది జనాలు వాటిని చెవికెక్కించుకోరు. ఇక ఆదివారాలు, అమావాస్య వస్తే.. ఎక్కడో ఓ చోట ఇలాంటి క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఇవన్ని ఎక్కడో మారుమూల గ్రామాల్లో, ప్రాంతాల్లో చోటు చేసుకుంటే.. ఏమో అనుకో వచ్చు.. కానీ స్వయంగా రాజధాని నగరంలో చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
హైదరాబాద్ పాత బస్తీ స్మశానాల్లో క్షుద్ర పూజల కలకలం చెలరేగుతోంది. ఖబరస్తాన్ అంటే ప్రశాంతంగా ఉంటుందని పేరున్నా.. అక్కడి నిశ్శబ్దం కూడా భయపెడుతుంది. ఇక్కడ స్మశానంలో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు.. జనాలను భయపెడుతున్నాయి. బొమ్మలకు మేకులు దించి.. ఆ పక్కనే కోడిగుడ్లు పెట్టారు. వాటి మీద ఏవేవో క్షుద్ర రాతలు రాశారు. అంతేకాదు దారాలు చుట్టిన కుండలు ఉండటం.. చూసి హడలెత్తి పోతున్నారు స్థానికులు. మంత్రగాళ్లు అక్కడితో ఆగక.. ఈ వస్తువులను చెట్ల కింద, సమాధుల్లో గోతులు తీసి.. పూడ్చి పెడుతున్నారు. వాటిని చూసి స్మశానాల్లోకి వస్తున్నవారు భయపడిపోతున్నారు. ఇక్కడి స్మశానాల్లో ఇలాంటి చిన్నపిల్లల బొమ్మలు.. వాటికి పేర్లు, ఆపై క్షుద్రమంత్రాలు.. బొమ్మల వెనక మేకులు దించిన భయానకమైన వాతావరణం కనిపించడంతో ఒక్కొక్కరికీ గుండెల్లో గుబులు రేగుతోంది. మరీ ముఖ్యంగా గత వారం రోజుల నుంచీ ఇక్కడ చేతబడులకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయ్ అంటున్నారు స్థానికులు.
ఇది కూడా చదవండి: Viral Video: వైరల్ వీడియో: ఉన్నట్టుండి నడి రోడ్డుపై చేపల వర్షం.. ఎగబడ్డ జనం..
దీంతో స్మశానాలకు ఏదో ఒక పని మీద వచ్చేవారు బెంబేలెత్తిపోతున్నారు. మతాధికారులు, స్మశానాల ఇంఛార్జీలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో తామెన్నడూ ఇలాంటివి చూడలేదనీ.. ఇప్పుడే ఇలాంటి చేష్టలను గమనిస్తున్నామనీ.. ఇకపై ఇలాంటివి లేకుండా చూడాలని కోరుకుంటున్నారు. అప్పటికీ తాము రాత్రిళ్లు ఇలాంటి మంత్రగాళ్లను గుర్తించే యత్నం చేస్తున్నామనీ.. అయినా సరే తమ కన్ను కప్పి.. తమ పని తాము చేసుకెళ్తున్నారనీ.. ఇకనైనా ఇలాంటి బాణామతి- చేతబడి చిల్లంగి వంటి క్షుద్ర పూజలు చేసేవారిని గుర్తించాలంటే…సీసీ కెమెరాలు అమర్చడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సూచిస్తున్నారు కొందరు. మరి చూడాలి.. స్మశాన నిర్వాహకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటారా.. లేదా చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bihar: చీమలు చేసిన పనితో.. బిహార్లో వెలుగులోకి బంగారు గని!