జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన కేసు కీలక మలుపులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో సాదుద్దీన్ మాలిక్(18) ఒక్కడే మేజర్ కావడంతో మిగిలిన ఐదుగురిని జువైనల్ హోమ్ కు తరలించారు.. వారి వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి తన గళం వినిపిస్తూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి. వాటిపై ఆయన స్పందిస్తూ న్యాయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
తనకు నోటీసులు ఇచ్చినా, కేసు నమోదు చేసినా న్యాయపరంగా ఎదుర్కొంటానని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన మరెన్నో కీలక విషయాలను సువన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.