ప్రభుత్వం వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెంచే కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులు స్ఫూర్తిగా ఉండటం మంచి పరిణామమం. గతంలో తన భార్యను ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించిన భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి స్ఫూర్తిని మరువక ముందే మరో కలెక్టర్ తన పిల్లలను ప్రభుత్వ అంగన్ వాడీలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ముందు వరుసలో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుమార్తెలు.
ఆర్థిక స్థితి కొంత బాగుంటేనే…పిల్లలను ప్లేస్కూల్ పంపుతున్న ఈ రోజుల్లో కలెక్టర్ రాహుల్ రాజ్ తన ఇద్దరు కుమార్తెలను నిర్వికరాజ్, రిత్వికరాజ్ లను అంగన్ వాడీ కేంద్రానికి పంపిస్తూ ప్రభుత్వ అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఇద్దరు చిన్నారులు జన్కాపూర్-1 అంగన్ వాడీ కేంద్రంలో సహచరులతో ఆడుతుపాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. కలెక్టరు పిల్లలు మూడు నెలలుగా ఇక్కడికి వస్తున్నారని, ఇక్కడే భోజనం చేస్తున్నారని అంగన్ వాడీ ఉపాధ్యాయురాలు అరుణ తెలిపారు.