ఈమధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల సీనియర్ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మరణించారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 11న ఆయన మరణించారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇంట తీవ్ర విషాదం చోటుకుంది. ఆయన మాతృమూర్తి జోగు జోజమ్మ(98) మరణించారు.
మాజీ మంత్రి, అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో జోగు జొజమ్మ కన్నుమూశారు. జోగు రామన్న మాతృమూర్తి మరణవార్త తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. విషాదంలో ఉన్న జోగు రామన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బోజమ్మ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4గంటలకు వారి స్వగ్రామం దీపాయిగూడెంలో నిర్వహించనున్నట్లు జోగురామన్న కుటుంబసభ్యులు తెలిపారు.