ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాహనాల ప్రమాదాలు ప్రాణాల మీదకు తీసుకు వస్తున్నాయి.. ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. తాజాగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న మంత్రి కాన్వాయ్ను వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మంత్రి తన కాన్వాయ్లోని ఓ కారులో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. అనంతరం మంత్రి అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. అయితే గతంలో మంత్రి ఎర్రబెల్లికి ఘోర రోడ్డు ప్రమాదం సంబవించిన విషయం తెలిసిందే.