ఆమె పేరు సునీత. వయసు 37 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమె ఎప్పటికైనా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలనుకుంది. ఇక ఆమె అనుకున్నట్లుగానే బాగా చదివి ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం సాధించింది. అప్పటి నుంచి సునీత నిరుపేద పిల్లలకు చదువు బోధిస్తూ ఎంతో మంది పిల్లల జీవితాల్లో వెలుగు నింపింది. ఇక అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో ఆమె జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపుకు తిరిగింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని మంథని ప్రాంతం. ఇక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సునీత అనే మహిళ సైన్స్ టీచర్ గా సేవలు అందిస్తుంది. ఉన్నత చదువులు పూర్తి చేసిన సునీత ఎప్పటికైన పేద పిల్లలకు చదువును చెప్పాలనే తన కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకుంది. ఇందులో భాగంగా సునీత ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఇప్పటికీ ఎంతో మంది పిల్లలను తీర్చుదిద్దింది. ఇదిలా ఉంటే బుధవారం సునీత ఎప్పటిలాగే విధులకు హాజరైంది. అయితే ఆ మహిళ ఉన్నట్టుండి క్లాస్ రూమ్ లోనే కుప్పకూలిపోయింది.
దీంతో వెంటనే స్పందించిన తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆమె అప్పటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం తోటి ఉపాధ్యాయులు ఈ విషయాన్ని సునీత కుటుంబ సభ్యులకు చేరవేశారు. సునీత మరణించిందన్న వార్తతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక ఉన్నట్టుండి సునీత ప్రాణాలు కోల్పోవడంతో తోటి విధ్యార్థులు, పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.