Vedaryan: మూడేళ్ల చిరుప్రాయం.. తనలాంటి తోటి పిల్లలతో అల్లరి చేస్తూ ఆడుకోవాల్సిన వయసు. ఏదో మాయల మంత్రం వేసినట్లు అతడి లేత శరీరంపై న్యుమోకాకల్ వ్యాధి దాడిచేసింది. ఆసుపత్రిలో మంచానికి పరిమితం చేసి, ఏటూ కదల్లేని స్థితికి తీసుకువచ్చింది. కన్నవాళ్లను కన్నీళ్లలో ముంచేసింది. ఆ కష్టం అంతటితో ఆగలేదు. చిన్నారిని మరింత వెంటాడుతోంది. శరీరంలోని ఒక్కో భాగం పాడవుతూ వస్తోంది. బాబు ఆరోగ్యం బాగవాలంటే లక్షల రూపాయలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 లక్షల రూపాయలపైగా..
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు చెందిన వి.వినీల దంపతులకు వి.వేదార్యన్ అనే మూడేళ్ల బాబు ఉన్నాడు. వినీల ఎంబీఏ చదువుతూ క్యాషియర్గా పార్ట్టైమ్ జాబ్ చేస్తోంది. తల్లి వినీల వేదార్యన్పై పంచ ప్రాణాలు పెట్టుకుని సాకుతోంది. తమకు ఉన్న దాంట్లో బాబుకు ఏ కష్టం రాకుండా చూసుకుంటోంది. బాబు కూడా తల్లంటే ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. అలాంటి వీరి ప్రేమను చూసి విధికి కన్నుకుట్టింది. వేదార్యన్కు అనారోగ్యం రూపంలో ఓ పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టింది. గత ఆదివారం పిల్లాడికి డెంగ్యూ వచ్చింది. ప్లేట్స్ లేట్స్ చెక్ చేయిస్తే బాగానే ఉన్నాయని వచ్చింది. అయితే, మరుసటి రోజు కడుపు నొప్పి మొదలైంది. దీంతో అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేల్చారు. తర్వాత ఆక్సిజన్ పెట్టారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువయింది. దీంతో అతడ్ని హైదరాబాద్లోని బంజారాహిల్స్ రేయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వేదార్యన్ ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి కొంత విషమంగానే ఉంది. ఈ నేపథ్యంలో అతడి ఆరోగ్యం మెరుగవ్వాలంటే మరికొన్ని రోజులు ఆసుపత్రిలోని వెంటిలేటర్పై ఉంచాల్సి ఉంటుంది. మరింత మెరుగైన చికిత్స చేయాల్సి ఉంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో లక్షల రూపాయల డబ్బులు అవసరం అవుతాయి. ఇప్పటికే తల్లిదండ్రులు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మరో 15 లక్షలు చికిత్స కోసం అవసరం ఉంటుంది.
ఆ ఖర్చు 15 లక్షలకు మించి పోవచ్చని కూడా తెలుస్తోంది. వెంటటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతున్న కొడుకును బతికించుకోవాలన్న బలమైన కోరిక ఉన్నా.. ఏమీ చేయలేని పరిస్థితి. వినీల సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తోంది. తోచినంత సహాయం చేసి తన బిడ్డకు ప్రాణ దానం చేయమని ప్రార్థిస్తోంది. మరి, వేదార్యన్కు మీ వంతు సహాయం అందించాలనుకుంటున్నారా?.. అయితే ఈ కింది లింక్ను క్లిక్ చేయండి. ఓ చిన్న బాబుకు ప్రాణ దానం చేసే మహోన్నత కార్యక్రమంలో మీరూ భాగస్వామ్యులు కండి.