సాధారణంగా ఓ ఇంట్లో ఐదో ఆరో ఓట్లు ఉండటం సహజం. ఉమ్మడి కుటుంబం అయితే, పదో, పదకొండో ఓట్లు ఉంటాయి. కానీ, ఓ ఇంట్లో ఏకంగా 120 ఓట్లు ఉన్నాయి. దీంతో అధికారులు షాక్ అయ్యారు.
ప్రజలు తమ ప్రతినిధులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇంకో నాలుగు నెలల తర్వాత ఎన్నికలు జరగనున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలో అధికారులు ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్నారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు బోగస్ ఓటర్లను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తున్న సందర్భంగా అనేక రకాల ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. ఒక ఇంట్లో సాధారణంగా నాలుగు లేదా ఐదు ఓట్లు ఉంటాయి. మరీ పెద్ద కుటుంబం అయితే తొమ్మిది లేదా పది మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంది. కానీ, ఒక ఇంట్లో 120 మంది ఓటర్లు ఉన్నారు. అవును! మీరు విన్నది నిజమే. ఇంతకీ సంగతేంటంటే..
తాజాగా, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని 181 నుంచి 218 వరకు ఉన్న పోలింగ్ బూతుల పరిధిలో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ పోలింగ్ బూతులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఓ ఇంట్లో ఏకంగా 120 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక, అధికారులు బోగస్ ఓటర్లను గుర్తించి, వాటిని ఏరి వేసి సరైన ఓటర్ల జాబితాను తయారు చేసే పనిలో పడ్డారు. సంగారెడ్డి ఒక్క జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల వారిగా ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయుటకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరి, ఒకే ఇంట్లో 120 మంది ఓటర్లు ఉన్న ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.