దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి కనపరుస్తున్నారు. పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ద్రుష్టి సారించడంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగ జోరందుకుంది. ఈ క్రమంలో బెంగళూరు బేస్డ్ ఆటోమోటివ్ స్టార్టప్ కంపెనీ ‘ప్రవైగ్’ తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ SUV అయిన ‘డిఫై’ని లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జ్తో 500 కి. మీ. కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఆడీ ఈ-ట్రాన్, మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ మోడళ్ళకు పోటీగా సంస్థ ఈ నయా మోడల్ను ఆవిష్కరించింది.
దేశీయ మార్కెట్లో ‘ప్రవైగ్ డిఫై’ ఎక్స్-షోరూమ్ ధర రూ. 39.50 లక్షలు. ఇప్పటికే ఈ SUV బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 51,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందచేయనున్నట్లు ప్రవైగ్ చీఫ్ స్ట్రాటజీ అధికారి రామ్ దివేది తెలిపారు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. మల్టిపుల్ వైర్లెస్ ఛార్జర్లు, ల్యాప్టాప్లను ఛార్జ్ చేయగల రెండు హై-పవర్ USB-C పోర్ట్లు ఇందులో అందించారు. అంతే కాకుండా ఈ SUV ప్రత్యేకమైన కీ కార్డ్తో వస్తుంది. కావున కనెక్టెడ్ కార్ టెక్ ద్వారా లాక్/అన్లాక్ చేయవచ్చు.
దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ కాగా, 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 90.2 kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. కావున ఇది ఒక ఛార్జ్పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ డిసి ఛార్జర్ ద్వారా కేవలం 30 నిముషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ప్రవైగ్ డెఫీ అనేది 4.94 మీటర్ల పొడవు, 1.65 మీటర్ల ఎత్తు మరియు 1.94 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ కారు చూడడానికి లుక్ పరంగా ఆకట్టుకుంటోంది.
#Bengaluru-based auto startup, #Pravaig, has launched its first #SUV, the fully #electric #Defy at Rs 39.5 lakh, ex-showroom. It gets a 90.9kWh battery and 500km claimed range. There’s also an off-road focused model, dubbed the #Veer made exclusively for military use. pic.twitter.com/sGU7HPFgiK
— evoIndia (@evoIndia) November 25, 2022